
ఆకేరు న్యూస్, హైదరాబాద్, అమరావతి : తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు హరియాణాకు చెందిన దీక్ష, తమిళనాడుకు చెందిన సుష్మిత, ఏపీకి చెందిన బొడ్డు హేమంత్, మనీషా వంగల రెడ్డిలను.. అలాగే తెలంగాణకు జమ్మూకశ్మీర్కు చెందిన మనన్ భట్, తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, సాయి కిరణ్, ఉత్తర ప్రదేశ్కు చెందిన యాదవ్ వసుంధరను కేటాయించారు.