
* 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
* తీర్పు వెలువరించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
* జానీ మాస్టర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు..
* పోలీసులకు రంగారెడ్డి కోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: లైైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. జానీ మాస్టర్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను నాలుగేండ్ల నుంచి లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నందున పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయనను కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ను కస్టడీకి అనుమతిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కాగా, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని.. జానీ మాస్టర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో పోలీసులు జానీ మాస్టర్ను ఇవాళ విచారించనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఈ నెల 19న పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసు, పోక్సో కింద కేసులు నమోదవడంతో జానీ పరారీలో ఉండగా పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల బృందం జానీ మాస్టర్ను హైదరాబాద్కు తరలించి.. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.ఈ మేరకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ను విధించింది. ప్రస్తుతం జానీమాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
……………………….