
* నేడు లాస్ట్ వర్కింగ్ డే.. సీజేఐ డీవై చంద్రచూడ్
ఆకేరు న్యూస్, డెస్క్ : రేపటి నుంచి తాను తీర్పులు ఇవ్వలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) తెలిపారు. నేడు లాస్ట్ వర్కింగ్ డే అన్నారు. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు కావడంతో సుప్రీం ధర్మాసనం ఆయనకు వీడ్కోలు పలికింది. ‘రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవం.. అయినప్పటికీ నేను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని చివరి సందేశం ఇచ్చారు. కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ తన లాస్ట్ వర్కింగ్డే రోజు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (Aligarh Muslim University)కి మైనార్టీ హోదా విషయంలో కీలక తీర్పు వెలవరించారు. సుప్రీంకోర్టు(Sruprim Court) రాజ్యాంగ ధర్మాసనం నాలుగు రకాల తీర్పులను వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు ధర్మాసనం ఈ తీర్పుల గురించి తెలిపింది. ఏఎంయూ (AMU)కేసులో నాలుగు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని, దీంట్లో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. మెజారిటీ తీర్పు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజే వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
సోమవారం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
మరోవైపు భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
…………………………………….