
* ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ ఉపసంహరణపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ ఉపసంహరణపై చర్చ మొదలైంది. ఏఐసీసీ(AICC) అంతర్గత సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఈ అంశాలు కూడా తెరపైకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ ఢిల్లీ టూర్(DELHI TOUR) రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలన్న ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగింది. అలాగే, మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకూ అవకాశాలు వస్తాయని మరికొందరు ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఈ అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. కాగా, ఏఐసీసీ సమావేశం అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి మహారాష్ట్ర(MAHARASTRA)కు రేవంత్ వెళ్లనున్నారు.
…………………………………………..