
* రూ. 5 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టివేత
ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వర్ధన్నపేట మండలం కడారిగూడెకు చెందిన మాజీ సర్పంచ్ సతీశ్ను ఏఈ కార్తీక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కార్తీక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఈ కార్తీక్ మాజీ సర్పంచ్ నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏఈని అధికారులు విచారించి కేసు నమోదు చేశారు.
………………………………………………..