
* మంత్రి కొండా సురేఖను కోరిన మన్నూరు కాపు సంఘం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మున్నూరు కాపు కార్పోరేషన్కు ఛైర్మన్ను వెంటనే నియమించాలని కోరుతూ తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం ఆధ్వర్యంలో మన్నూరు కాపు సంఘం శుక్రవారం మంత్రి కొండా సురేఖను జూబ్లిహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలని మంత్రి సురేఖను కోరారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సందర్బంగా మంత్రి సురేఖను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ కాపుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశద్ధితో వుందని, ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి త్వరితగతిన మున్నూరుకాపు కార్పోరేషన్కు ఛైర్మన్ను నియమించేలా చర్యలు చేపట్టడంతో పాటు, మున్నూరు కాపుల సంక్షేమంపై చర్చిస్తానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
………………………..