* సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టు పరిశీలన, చర్చ
* ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్ వివరాలు సేకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)నిర్మాణంలో గత ప్రాజెక్టు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టేందుకు మరోసారి కమిషన్(Commission) తెలంగాణకు వచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించనుంది. ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్(Quality Control) పై వివరాలు సేకరించింది. నిర్మాణంలో సాంకేతిక అంశాలను పరిశీలించనుంది. అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను తెలుసుకునేందుకు ఈ కమిషన్ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్ల నుంచి వాంగ్మూలాలను ఈ కమిషన్ రికార్డు చేసింది. గతంలోనే బ్యారేజీలను కమిషన్ సభ్యులు పరిశీలించారు. మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ పైర్లు మునిగిపోవడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి లీకేజీలు ఏర్పడడడంపై ఆరా తీసింది. ఈసారి అధికారులు, ఇంజినీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
