
ఆకేరున్యూస్, వరంగల్: సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఏకంగా ఒక గృహపరిశ్రమ తరహాలో నిందితుడు తన ఇంటి మేడపైనే పూలకుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. గురువారం రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపడుతున్న యాంటీ డ్రగ్స్ టీం పోలీసులకు పక్క సమాచారం రావడంతో పోలీసులు మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలంతో మేడ పైన గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని మీల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేసిన యాంటీ డ్రగ్స్ టీం..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రaా ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం, ఇంతేజార్గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వేస్టేషన్లో పోలీస్ జాగిలంతో ముమ్మరతనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానాస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగులను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ టీం ఇంచార్జి ఇన్స్పెక్టర్ సురేష్ ప్రయాణికులతో మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న, వినియోగిస్తున్న తక్షణమే 8712584473 సెల్ నంబర్కు సమాచారం అందించాలని.. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో యాంటీ డ్రగ్స్ టీమ్ ఇన్స్పెక్టర్స్ జె సురేష్, ఆర్ఐ శివ కేశవులు, ఆర్ ఎస్ఐ పూర్ణ చంద్రా రెడ్డి, ఎస్ఐ చాంద్ పాషా, ఏఎస్ఐ సాంబయ్య పాల్గొన్నారు.
………………………………………………….