
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ముగ్గురు దుర్మరణం చెందారు. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైర్ బరస్ట్ (Car Tire Burrest)కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న లారీ డ్రైవర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. లారీ వెనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengalure)వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
…………………………………