
* కోత విధిస్తే అల్లం నారాయణ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం
* TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్
ఆకేరున్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అల్లం నారాయణ అక్రిడిటేషన్లు ఇప్పిస్తే… ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టేందుకు సిద్ధమైందని, ఒక వేళ అదే జరిగితే పోరాటాలకు సిద్ధమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ (H-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ హెచ్చరించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (H-143) హనుమకొండ జిల్లా కమిటీ మొదటి కార్య వర్గ సమావేశం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ లెనిన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులను అల్లం నారాయణ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడుపులో పెట్టుకుని కాపాడుకుందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి తడక రాజ్ నారాయణ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నింపిన ఘనత మునియన్ కి దక్కుతుందని అన్నారు. యూనియన్ బలోపేతం అయితే ప్రెస్ క్లబ్ లను సునాయసంగా గెలుచుకోవచ్చని రాజ్ నారాయణ సూచించారు. అందుకుగాను హన్మకొండ జిల్లా కమిటీ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకమీదట యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందని, హన్మకొండ నగరంతో పాటు మండలాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాదనే ద్యేయంగా పనిచేస్తామని, అందుకుగాను మంత్రులు, ఎమ్మెల్యేల మీద యూనియన్ పరంగా వత్తిడి పెంచుతామని తెలిపారు. ప్రస్తుత ప్రెస్ క్లబ్ పాలకవర్గం గత ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని, హామీల అమలు కోసం ప్రెస్ క్లబ్ పాలకవర్గాన్ని నిలదీస్తామని స్పష్టం చేసారు. ప్రెస్ క్లబ్ పాలకవర్గం పదవీ కాలం ముగిసినప్పటికీ మార్చిలో బాధ్యతలు తీసుకున్నాము… ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఉందని చెబుతున్నారని, ఈ అంశం మీద ఆయా యూనియన్ల సీనియర్ జర్నలిస్టులను సంప్రదించి కార్యాచరణ తీసుకుంటామని స్పష్టం చేసారు. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాడ్ల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరిపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిటిషన్ ను ప్రెస్ క్లబ్ కమిటీ వెనిక్కి తీసుకుని, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. యూనియన్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్ట్ లు పెడితే సహించేది లేదని, ఒకవేళ ఏ సభ్యుడైన ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఇకమీదట యూనియన్ లో వ్యక్తి పూజ, నిర్ణయాలు ఉండవని. ప్రతిదీ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ లను సంప్రదించి వారి ఆదేశాల ప్రకారం హన్మకొండ జిల్లా కమిటీ పనిచేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఆమోదించారు. యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి అర్షం రాజ్ కుమార్, యూనియన్ కోశాధికారి పొగాకుల ప్రభాకర్ గౌడ్, యూనియన్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు బూరం ప్రశాంత్, తాళ్లపళ్ళి వేణుగోపాల్, వీడియో జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి సుంచు రామరాజు, ఫోటో జర్నలిస్ట్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టే వెంకన్న, సంపేట సుధాకర్, యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు దుంపల పవన్, ఆరేల్లి కిరణ్, చింతల సత్యనారాయణ, బి దేవేందర్, గోకారపు శ్యామ్ కుమార్, సిరిమల్లె సదానందం, బుడిగే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు రాజేందర్, మైదం సుధాకర్, హింగె రాజేశ్వర్ రావు, కర్నాకర్, బండారి సతీష్, బానాల ధన్ రెడ్డి, బొమ్మగాని ఆదర్శ్, అప్పని సిద్దు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
………………………………………