
* కశ్మీర్ సిగలో మరో మణిహారం
* ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి
* మొట్టమొదటి తీగల వంతెన
* రెండు కొండల మధ్య నిర్మాణం
* ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్ల రైలు లింకు ప్రాజెక్టు ప్రత్యేకతలెన్నో..
* అతి త్వరలోనే ప్రజల ముందుకు
ఆకేరు న్యూస్ డెస్క్ : భారతీయ రైల్వే (INDIAN RAILWAY)ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. మొట్టమొదటి తీగల వంతెనను నిర్మించింది. రెండు దశాబ్దాల క్రితం నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఇది అందుబాటులోకి వస్తే జమ్ము (JAMMU) నుంచి కశ్బీర్(KASHMIR) కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణం చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణ పెరగనుంది. సైనికులు వేగంగా ప్రయాణించడానికి అనుకూలంగా మారనుంది. ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపారపరంగా అనేక అవసరాలు తీరతాయి. ఎంతో ప్రత్యేకత గల ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్ల రైలు లింకు ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తేవడానికి భారతీయ రైల్వే కసరత్తు పూర్తి చేసింది.
ఈ ప్రాజెక్టులు విశేషాలు..
* ఈ బ్రిడ్జి నిర్మాణానికి 96కుపై గా కేబుల్ (CABLE) స్తంభాలు ఏర్పాటు చేశారు.
* 38 సొరంగ మార్గాలు.. పొడవు 119 కిలోమీటర్లు..
* అత్యంత క్లిష్టమైన నిర్మాణం
* 37వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు
* ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి(TALLEST RAILWAY BRIDGE)గా గుర్తింపు
* రెండు కొండల మధ్య నిర్మాణం
* 28,600 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగం
* కింది నుంచి 330 మీటర్ల ఎత్తులో నిర్మాణం
* అటు ఇటు చుట్టూ కొండలు.. బలమైన గాలుల వీచే ప్రాంతం
* సుమారు 213 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసినా తట్టుకునే సామర్థ్యం
………………………………….