
* ఉమ్మడి ఆదిలాబాద్ వాసులను హఢలెత్తిస్తున్న పులి
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్(ADILABAD) జిల్లావాసులను రెండు, మూడు రోజులుగా పులుల భయం వెంటాడుతోంది. ఓ ఆడపులి, మగ పులి సంచారాన్ని గుర్తించిన ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే, అందులో మగపులి మహారాష్ట్ర(MAHARASTRA) వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆడపులి జాడ కనిపించ లేదు. దీంతో అదెక్కడ అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మేటింగ్ సీజన్ కావడంతో ఆ పులులు కలయిక కోసమే తిరుగుతున్నట్లు అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. మగపులి జాడ తెలిసినప్పటికీ, ఆడ పులి జాడను ఇంకా కనుక్కునే పనిలో ఉన్నారు.
……………………………….