* ఎదురుకాల్పుల్లో 18 మంది మావోలు, ఒక జవాను మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఛత్తీస్ గఢ్లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను కూడా మృతి చెందారు. బీజాపూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. గంగలూరి పరిధి అండ్రి అడవుల్లో(Andri Forest) మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
