* విచారణలో విషయం తెలిసి ముక్కున వేలేసుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : ఆయనో ఏఎస్ఐ.. నెలనెలా మంచి జీతం.. అయినా ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. జనం ఉతికి ఆరేశారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. మహేశ్ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Sircilla) మున్సిపల్ పరిధిలోని సర్థపూర్లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్లో ఏఎస్ఐ(ASI)గా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సోమవారం రాత్రి పట్టణంలోని ఓ ఇంట్లో దూరి, చోరీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నవారికి పట్టుబడ్డాడు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఆయన దొంగగా మారడం వెనుక కారణాలేంటి, చోరీ యత్నం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
