
ఆకేరు న్యూస్ డెస్క్ : మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలోనూ అధికారం ఎవరిదో స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 199 సీట్లలో ఆధిక్యత కనబరుస్తూ.. మరోసారి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వలేక పోయింది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకునేందుకు 145 సీట్లు రావాల్సి ఉంటుంది. మేజిక్ ఫిగర్ సాధించి మళ్లీ అధికారంలోకి మహాయుతి కూటమి వచ్చే దిశగా ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.
జార్ఖండ్ లో..
మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండువిడతలుగా పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ కూటమి 50కు పైగా స్థానాల్లో అధిక్యంలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలో ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఉంది. బీజేపీ కూటమి ప్రస్తుతం 30కి పైగా అధిక్యంలో కొనసాగుతోంది.
……………………………………………….