
వరంగల్ లో మరో హత్య
- డబ్బులడిగితే వడ్డీ వ్యాపారిని చంపేశాడు
- కాజీ పేట లో దారుణం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ లో మరో మర్డర్ జరిగింది.. శుక్రవారం రాత్రి కాజీపేట లో ఈ దారుణం జరిగింది.. మృతుడు అనిల్ రెడ్డి ( 45 ) వడ్డీ వ్యాపారి అని తెలిసింది. కాజీపేట రైల్వే ఉద్యోగికి అనిల్ రెడ్డి అప్పు ఇచ్చాడు.. ఆ డబ్బులు చెల్లించమని అడిగేందుకు కాజీపేట కు చేరుకున్న అనిల్ రెడ్డి కి డబ్బులు తీసుకున్న వ్యక్తి మద్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలిసింది . కాజొక్కసారిగా అకస్మాత్తుగా దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.. మృత దేహాన్ని కాజీపేట పోలీస్ లు పోస్ట్ మార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రి కి తరలించారు..
———-