
ఆకేరున్యూస్ డెస్క్ : తొర్రూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు స్వామి రోజువారి విధులకు హాజరయ్యే సమయంలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగారా లేదా అని అడుగుతూ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. దీంతో తొర్రూరు అయ్యప్ప స్వాములు తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై విచారణ జరిపి సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎం పద్మావతి తెలిపారు.
…………………………………..