
* బస్సు తప్ప.. అంతా తుస్సే
* ఒక్క హామీ నెరవేర్చని రేవంత్ రెడ్డి
* ప్రభాకర్ ఆత్మహత్య ముమ్మాటికి కాంగ్రెస్ చేసిన హత్యే
* అదానీపై ఢిల్లీ కాంగ్రెస్ ఒక మాట.. గల్లీ కాంగ్రెస్ ఒక మాట
* రైతులు మళ్లీ కేసీఆరే రావాలంటున్రు..
* మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరు న్యూస్, ఖమ్మం: అయితే తిట్లు.. లేదంటే దేవుని మీద ఒట్లు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిన విద్య అని మాజీ మంత్రి హరీశ్ రావు(Ex Minister Harishrao) ఆరోపించారు. బస్సు తప్ప.. అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బొజ్యాండ్ల ప్రభాకర్ అనే రైతు కుటుంబాన్ని హరీశ్రావు పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్ యార్డుకు వెళ్లినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతుండడం గమనించానని అన్నారు. మళ్లీ కేసీఆరే రావాలని అంటున్నారని తెలిపారు. మార్పు మార్పు అని ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఏం మార్పు వచ్చిందని, రైతుబంధు బంద్ అయింది.. బతుకమ్మ చీరలు బంద్ అయినయ్.. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది.. కేసీఆర్ కిట్(Kcr Kit) బంద్ అయింది.. దళిత బందు బంద్ అయింది. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు బంద్ అయినయి.
బీసీ బంధు బంద్ అయింది… అని విమర్శించారు.
మహిళల ఓట్లు దండుకుని మోసం..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని తెలిపారు. భట్టి విక్రమార్క ఇంటింటికి బాండ్ పేపర్ మీద రాసి మరీ హామీ ఇచ్చాడమన్నారు. ఒక్కొక్క మహిళకు 11 నెలల్లో 27500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. మహిళల ఓట్లు దండుకొని మోసం చేశారని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని మోసం చేశారు.. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామని మోసం చేశారు.. కేసిఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు.. కళ్యాణ లక్ష్మి ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా అమలు చేసి చూపించాడు కేసీఆర్.. అని వివరించారు.
11 నెలల్లో 6 లక్షల పెళ్లిళ్లు
గత 11 నెలల్లో తెలంగాణలో 6 లక్షల పెళ్లిళ్లు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడిందని హరీశ్రావు వెల్లడించారు. బస్సు సర్వీసులను తగ్గించి ఆడబిడ్డలను కాంగ్రెస్ సర్కారు ఇబ్బంది పెడుతోందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు రేవంత్ రెడ్డి (Revanthreddy)అని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి అయినా దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? అని ప్రశ్నించారు. అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు అన్నారు.
తలకాయలేని ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాదుకు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ అని హరీశ్రావు ఆరోపించారు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటన్నారు. ఎన్నికల్లో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి అమలు చేస్తానన్న ఆరు గారెంటీలు ఒకటైన అమలు అయ్యాయా? అని ప్రశ్నించారు. 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది కేసీఆర్. 4000 పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఉన్న 2000 పైసలు కూడా రెండు నెలలు ఎగ్గొట్టిందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల15000 రైతుబంధు ఇస్తామని ఉన్న 10000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ప్రశ్నించేవారి గొంతునొక్కడం ఆయనకు అలవాటన్నారు. ఆదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒక మాట గల్లీ కాంగ్రెస్ ఒక్క మాట అని తెలిపారు. అంతర్గత ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తున్నదని ఆరోపించారు. కేసిఆర్ ఉన్నప్పుడు ఆదానీ అనేవాడు తెలంగాణకు రాగలిగాడా? ఒక రూపాయి అయినా తెలంగాణలో పెట్టుబడి పెట్టగలిగాడా? అని ప్రశ్నించారు. రైతు ప్రభాకర్ (Former Prabhakar) భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తే ఆ దురాగతాలకు ప్రాణాలు విడిచిన ప్రభాకర్ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందని తెలిపారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలని, ఏ పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదని అన్నారు.
………………………………………….