Chandrababu Naidu Tirumala Visit
Chandrababu Naidu Tirumala Visit : ఆకేరు న్యూస్, తిరుమల : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
చంద్రబాబు నేడు పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అనంతరం గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులకు ఫ్లాగ్ఆఫ్ చేయనున్నారు. అలాగే ఎస్వీ మ్యూజియంను కూడా ప్రారంభించనున్నారు.
తిరుమలలోని వివిధ అంశాలపై అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది.
తిరుమల పర్యటన ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
