
* రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నా
* బనకచర్లపై చర్చకు సిద్ధం
* మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట ః బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి తాను
సిద్ధంగా ఉన్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు..బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ బీఆర్ఎస్లో చేరారు. ప్రశాంత్ పాటిల్కి హరీష్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరీష్రావు వెంట అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నిర్వహించడం చేతగాక రేవంత్రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని హరీష్ అన్నారు, ఎన్నకలు ఎప్పుడు జరిగినా బీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రేవంత్రెడ్డి ఐదేళ్లు పూర్తిగా అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
………………………………………………..