
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని అగ్ర నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. మహారాష్ట్ర, హర్యానాల్లో గెలిచేందుకు మంచి అవకాశాలున్నా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడగానికి కారణాలు ఏమిటి..? లోపాలు ఎక్కడున్నాయ్..? అనే అంశాలు సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు రానున్నాయని సమాచారం. అదేవిధంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
……………………………….