
* ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు
* 311 సైలెన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు
ఆకేరు న్యూస్ వరంగల్ ః ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు వాహనదారులను హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కేయుసి జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత మూడు నెలల కాలంలో ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో పాటు వాహన దారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు . ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో 311కు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 275 కాగా కాజీపేట 111, వరంగల్ 75 వాహనాలు వున్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ అదనపు డీసీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇక ముందు ఎవరైనా సైలెన్సర్లను మార్చితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములోట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్లు రామకృష్ణ, సీతారెడ్డి, వెంకన్నతో పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గోన్నారు.
…………………………………………………………