* ఎన్కౌంటర్పై పోలీసుల ఫేక్ ప్రకటన
* సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి పేరిట లేఖ విడుదల
ఆకేరున్యూస్, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ దామోదర్ అలియాస్ చోక్కారావు క్షేమంగా ఉన్నాడని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. చత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది. ఈ ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోలేదని ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేశారు. పోలీసులు కావాలనే ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మరణించారని వారిలో నలుగురు మావోయిస్టులు కాగా మరో నలుగురు గ్రామస్తులు ఉన్నారని తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
