
Hyderabad | ఇంట్లోంచి మంటలు.. వెళ్లి చూసేసరికి ఘోరం..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోంచి మంటలు రావడంతో అగ్ని ప్రమాదం అనుకుని లోనికి వెళ్తే దారుణ ఘటన కలిచివేసింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవగిరి ఓ ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. బండ్లగూడ సీఐ గురునాథ్, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లిచూసేసరికి నిర్ఘాంతపోయారు. ఓ మహిళ శవం కాలుతూ కనిపించింది. మృతురాలు కెతావత్ బుజ్జిగా పోలీఅసులు గుర్రతించారు. ఆమెను అగంతకులు గొంతుకోసి చంపేసి, డెడ్బాడీని కాల్చివేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
——————————