
* ఉత్తర ప్రదేశ్ లో ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్: స్పెషల్ ట్రైన్ లోని లగేజ్ కోచ్లో మంటలు మంటలు వ్యాపించిన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బీహార్ కు వెళ్తోన్నపూర్ణియా స్పెషల్ రైలు ఘజియాబాద్ జిల్లా సాహిబాబాద్ వద్దకు రాగానే లగేజ్ కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అధికారులు రైలును ఘజియాబాద్లో ఆపేసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైల్లో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
……………………………………………..