
* మోసగాడు అని తేలిపోయింది
* మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది శూన్యమని.. ఆయన మొనగాడేం కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతు ధర్నాలో పాల్గొన్న హరీశ్రావు మాట్లాడారు. రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కొమరెల్లి మల్లన్న, యాదాద్రి, భద్రాద్రి, సమ్మక్క – సారలమ్మ మీద ఒట్టు పెట్టి మొనగాడు లెక్క మాట్లాడిరడు. కానీ ఇప్పుడు ఆయన మోసగాడు అని తేలిపోయిందని… రైతుబంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సప్పుడు లేదు.. సడి లేదన్నారు. మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయ్ హరీష్ రావు అని సవాల్ విసిరిండు. మరి రుణమాఫీ అయితే ఇంతమంది రైతులు ధర్నాకు ఎందుకు వచ్చారు..? పాలకుర్తి మండలంలోనే 4314 మందికి రుణమాఫీ కాలేదని హరీశ్రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని.. మిగతా వారికి కాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపాడన్నారు. చెప్పిన 22 లక్షల మందిలో కూడా కొందరికి పూర్తిగా రుణమాఫీ కాలేదని.. రకరకాల కారణాలతో రేవంత్ రెడ్డి రుణమాఫీ ఆపే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
……………………………..