
కమలాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
* సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల ఫైర్
* హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు
* మూసీ ప్రక్షాలన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
*మల్కాజిగిరి ప్రజలకు రాజేందరన్న ఉన్నాడన్న భరోసా కలిగింది
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : తానేదో సమాజ ఉద్దారకుడిని అన్నట్లు తాను గతంలో ఏ తప్పు చేయలేదన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజెందర్ ( Etela Rajender ) అన్నారు.గురువారం ఎంపీ విలేకరులతో పలు అంశాలపై మాట్లాడారు. హైడ్రాపేరుతో పేదల బతుకులు ఆగం చేశారని ఈటెల అన్నారునలభై , యాభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూల్చి పేదలను ఇళ్లు లేని వారిగా చేశారని ఈటెల అన్నారు. గ్రామపంచాయతీ, హెచ్ ఎం డీ లే అవుట్ లో కట్టుకున్ననివాసాలకు కూడా నోటీసులిచ్చి కూల్చారని ఈటెల అన్నారు పేదలు లబోదిబో మని మొత్తుకున్నా కనికరం చూపించలేదని అన్నారు. ప్రజలకు తన మీద నమ్మకం ఏర్పడిందని తమకు బాధ కలిగితే ఎంపీ రాజేందర్ అన్న ఉన్నాడనే ధైర్యంతో ఉన్నారని ఈటెల అన్నారు. సంవత్సకాలంగా కంటిమీద కునుకు లేకుండా పేదల గురించి ఆలోచిస్తున్నాని ఈటెల అన్నారు. మల్కాజిగిరి ప్రజల కాళ్లకు ముల్లు గుచ్చకుంటే పంటితో తీస్తానని ఈటెల అన్నారు.
…………………………………………..