
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః రేవంత్ రెడ్డి తరువాత తానే ముఖ్యమంత్రిని అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మూడేళ్లే కాకుండా వచ్చే ఐదేళ్లు సీఎం గా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లు ఆ ఐదేళ్లు మెత్తం ఎనిమిదేళ్ల తరువాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడాని తాను ప్రయత్నం చేస్తానని జగ్గారెడ్డి అనన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతున్నాం అంటూ జగ్గారెడ్డి అన్నారు. రైతులకు 9 రోజుల్లో రైతులకు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా పంపిణీ చేశామని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు. బీ ఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నమంచిపనులను చూసి ఓర్వలేక పోతున్నారని జగ్గారెడ్డి అన్నారు.
కేసీ ఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నప్పుడు రాష్ట్రం మిగులురాష్ట్రంగా ఉందని రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడనిజగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ కు అప్పులు చేసే అవకాశాలు పుష్కలంగా ఉండేవని రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ అమ్ముకున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తంటాలు పడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు
పోలీసులు వాట్సప్ లో మాట్లాడేవారు
గత ప్రభుత్వంలో పోలీసులు తనతో వాట్సాప్ కాల్ చేసి మాట్లాడే వారని జగ్గారెడ్డి అన్నారు. ఫోన్ ట్యాప్లకు గురవుతున్నాయిన తనకు పోలీసులు వాట్సప్ కాల్ చేసేవారని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్న ట్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులే తనకు స్వయంగా చెప్పారని జగ్గారెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుల ఫోన్లనీ్న కేసీఆర్ ట్యాప్ చేయించాడని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఎవరైనా చందాలు ఇస్తే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కొని ఆ డబ్బును పట్టుకునే వారని జగ్గారెడ్డి అన్నారు
కవితకు స్ట్రాంగ్ కౌంటర్
కవిత తాను స్పందించేంత గొప్పనాయకురాలు కాదని కేసీఆర్ కూతురు కాకపోతే కవిత నిల్ అని జగ్గారెడ్డి అన్నారు, కవిత పతీ విషయాన్ని రాద్దాంతం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని జగ్గారెడ్డి అన్నారు, కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జగ్గారెడ్డి అన్నారు.
బీఆర్ ఎస్ లో వారసత్వ గొడవ జరుగుతోంది
బీఆర్ ఎస్ పార్టీలో కేటీఆర్ కవితల మధ్య వారసత్వ యుద్దం జరుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. తండ్రి తరువాత సీట్ తనదేనని ఇద్దరు తహతహలాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. సహజంగా తండ్రి తరువాత కొడుకుకే వారసత్వం వస్తుందని కొడుకును కాదని కవితకు ఎలా పెత్తనం ఇస్తారని జగ్గారెడ్డి అన్నారు. కేసీ ఆర్ కూతురు అయినంత మాత్రాన కవిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని జగ్గారెడ్డి విమర్శించారు.
………………………………………………….