
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరున్యూస్, వేములవాడ: ఎన్యుమరేటర్లను అడ్డుకుంటే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం ఉదయం మంత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (adi srinivas ) తో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయడం లేదని.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన లేదన్నారు.
……………………………………..