* దిగుమతులపై నిషేధం
ఆకేరు న్యూస్, డెస్క్ : పహల్గామ్ దాడి తర్వాత మోదీ సర్కారు (MODI GOVERNMENT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం అన్ని రకాల ఉత్పత్తులకూ వర్తిస్తుందని పేర్కొంది. దిగుమతులతో పాటు గూడ్స్ ట్రాన్సిట్ పై కూడా నిషేధం విధించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పాక్ (PAK) చర్యలకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన విమానాలకు భారత గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత విమానాలకు గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసిన ఆరు రోజుల తర్వాత ఈ చర్య చేపట్టింది. భారత్, పాక్లు పరస్పరం విమానాలను తమ గగనతలాల్లోకి అనుమతించకుండా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు మే 23 అర్ధరాత్రి (మే 24, ఉదయం 5:29) వరకు అమల్లో ఉంటాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దాడి వెనుక పాకిస్థాన్ (PAKISTHAN) హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఉగ్రదాదిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి నాలుగు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేయడం మరింత బలం చేకూరింది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
