
* నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 15
ఆకేరున్యూస్, శ్రీహరికోట: ఇస్రో ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని షార్ నుంచి ఎస్ఎల్వీ రాకెట్-15 నింగిలోకి దూసుకెళ్లగా.. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లింది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్ జీఎస్ఎల్వీ-ఎఫ్12 మిషన్లో ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నేడు నింగిలోకి దూసుకెళ్లిన 2,250 కిలోల బరువైన ఎన్వీఎస్-02 శాటిలైట్ను యూఆర్ శాటిలైట్ కేంద్రంలో రూపొందించారు. ఇందులో రేజింగ్ పేలోడ్కు అదనంగా ఎల్1, ఎల్5 నావిగేషన్ పేలోడ్లు ఉండగా.. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జలమార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.
…………………………………….