
* తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు : హరీశ్రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు నివాళి అర్పించారు. 15వ వర్ధంతి సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతా చారి(SRIKANTHA CHARI) అని చెప్పారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడని తెలిపారు. జోహార్ శ్రీకాంతాచారి అంటూ ట్వీట్ చేశారు.
…………………………………