
* బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః బీసీల రిజర్వేషన్లు పెంచే హక్కు రాష్ట్రాలకే ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు.త్వరగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్ల పెపుపై పూర్తి అధికారం ఉందని కృష్ణయ్య తెలిపారు.అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఓకె చేశాయని కృష్ణయ్య గుర్తు చేశారు.ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావడంలేదని దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని కృష్ణయ్య అన్నారు. కళాలలకు వెళ్లకుండా విద్యార్థులు ఆందోళన బాట పట్టి సమయాన్ని వృథా చేసుకుంటున్నారని కృష్ణయ్య తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని కృష్ణయ్య కోరారు,అలాగే సొంత భవనాలు లేని ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించాలని సూచించారు. స్టడీ సర్కిల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేశారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తాను బీసీల కోసం పోరాటం చేస్తున్నానని అందుకు తన సహాయం కోరిందని కృష్ణయ్య తెలిపారు. బీసీల కోసం ఎవరు పోరాడినా తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీసీ బిల్లు అంశాన్ని కేంద్రంపై నెట్టివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
………………………………………………….