
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి శాసనమండలి ప్రతిపక్ష నేతగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం శాలువాతో సత్కరించారునీ సందర్భంగా కేటీఆర్కు మధుసూదనాచారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు మధుసూదనాచారికి శుభాంక్షలు తెలిపి, శాలువాలతో సత్కరించారు.
…………………………………