
ఆకేరు న్యూస్ ములుగుః ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం పలు రోడ్ల నిర్మాణానికి ఎం పి బలరాం నాయక్ తో కలిసి మంత్రి సితక్క శంకుస్థాపన చేశారు.ములుగు నుండి గణేష్ పల్లి వయా జీవంతరావుపల్లి వరకు డబుల్ లేన్ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్అంచనా విలువ రూ 350.00 లక్షలతో ప్రత్యేక మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతోపాటు మున్సిపల్ కమిషనర్ సంపత్,ఈ ఈ పంచాయతీ రాజ్ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
…………………………………………