
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్
ఆకేరున్యూస్, వరంగల్: పోలీసుల భారీ భద్రతల నడుమ ప్రపంచ సుందరీమణుల రేపటి పర్యటన కొనసాగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వర్డల్ పోటీలకు సంబంధించి హిరిటేజ్ పర్యటనలో భాగంగా రేపు హన్మకొండ, వరంగల్ నగరాల్లో పర్యటిస్తున్న ప్రపంచ సుందరీమణుల భద్రత ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేయిస్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్, హరిత కాకతీయ ప్రాంతాల్లో సుందరీమణుల భద్రత కోసం తీసుకుంటున్న భద్రత చర్యలపై పోలీస్ కమిషనర్ సెక్టార్ వారిగా ఇంచార్జ్ పోలీస్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు, సుందరీమణులు బస్సులో ప్రయాణించే రోడ్డు మార్గంలో ఎలాంటి సమస్యలు రాకుండా తీసుకుంటున్న భద్రత ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షా జరిపారు. ముఖ్యంగా సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించడం కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతం వున్న సిసి కెమెరాలతో పాటు అదనంగా మరిన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. ప్రపంచ సుందరీమణుల పర్యటన సందర్బంగా వారి భద్రత కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేయి మందికి పైగా పోలీసులు ఇందుకు వినియోగించడం జరుగుతోందని.ఇందులో ముగ్గురు డిసిపిలు, ఒక అదనపు డిసిపిలు, 11ఏసిపిలు, 32మంది ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు 81ఏఎస్ఐ/హెడ్కానిస్టేబుళ్ళు 155 కానిస్టేబుళ్ళు 325, మహిళా పోలీస్ సిబ్బంది 106, హోంగార్డ్స్ 210తో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ విభాగాలకు చెందిన పోలీసులను వినియోగించడం జరుగుతోందని. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన దేశంతో పాటు, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు తీసుకవచ్చే రీతిలో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండంతో ప్రతి పోలీస్ అధికారి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
…………………………………