
* వాస్తవాలు అంగీకరిస్తున్న పాక్
* 11మంది సైనికులు చనిపోయారు
* ఆర్మీ వెల్లడి
ఆకేరున్యూస్: పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల కారణంగా పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఆపరేషన్ సిందూర్లో, పాకిస్తాన్లో పెంచి పోషించిన అనేక మంది భయంకరమైన ఉగ్రవాదులను నాశనం చేశారు. ఆ తర్వాత పాక్ భారత్ పై దాడి చేసింది. భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ స్వయంగా దీనిని అంగీకరించింది. భారత సైన్యం జరిపిన దాడిలో 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ విూడియా విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను నిర్మూలిస్తామని భారత్ ప్రతిజ్ఞ చేసి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగింది. ఈ దాడిలో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. డాన్ వార్తాపత్రిక ప్రకారం, మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులలో నాయక్ అబ్దుల్ రెహ్మాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, లాన్స్ నాయక్ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయి ముహమ్మద్ ఆదిల్ అక్బర్, సిపాయి నిసార్ ఉన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. వైమానిక దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన రాజకీయ నేతలు తప్పుడు కథనాలను చెబుతూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పాడు. మరోవైపు, పాక్ వ్యాప్తంగా విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల్లో మాజీ క్రికెటర్ ఆఫ్రిదితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ ఓ వైపు క్లియర్గా శాటిలైట్ చిత్రాలతో పాకిస్తాన్కి జరిగిన నష్టాన్ని చూపిస్తుంటే, మరోవైపు తమకు ఏం కాలేదు, భారత్ తీవ్రంగా నష్టపోయిందని ఒక ఫేక్ ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తోంది. ఇదెలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్ తమ 11 వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేసినట్లు అంగీకరించారు. భారతదేశంతో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ విమానాలు దెబ్బతిన్నట్లు చెప్పాడు. పాకిస్తాన్ జెట్ని భారత్ కూల్చినట్లు స్పష్టమైన ఆధారాలతో వెల్లడిరచింది. అయితే, ఇషాక్ దార్ మాత్రం తమ జెట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంగీకరించారు. భారత పైలట్ ఎవరూ కూడా పాకిస్తాన్ వద్ద లేరని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని చాలా కీలమైన ఎయిర్ బేస్లపై భారత్ తీవ్రంగా విరుచుకుపడిరది. శనివారం తెల్లవారుజామున రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో సహా సర్గోదా, రఫికీ, జకోబాబాద్, స్కర్దు వంటి ఎయిర్ బేస్లపై విరుకుపడిరది. మొత్తంగా భారత్ పాక్కి చెందిన 11 వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత 35-40 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించినట్లు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెప్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడిరచారు.
……………………………………….