Mumbai Local Train Murder
* లోకల్ ట్రైన్లో ఘర్షణ.. యువకుడి హత్య
ఆకేరు న్యూస్, డెస్క్:
ముంబై లోకల్ ట్రైన్లో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. రైలు డోర్ వద్ద నిలబడిన ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి కత్తిపోటుకు దారితీసింది.
పోలీసుల కథనం ప్రకారం, ములుండ్కు చెందిన రోహన్ లోఖండే (21) మరియు మరో యువకుడు లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా డోర్ వద్ద నిలబడే విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో నిందితుడు కత్తితో దాడి చేయడంతో రోహన్ తీవ్రంగా గాయపడ్డాడు.
సహ ప్రయాణికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
