
* డబ్బు కోసం దంపతుల పాడు పని
* తమ ఏకాంత వీడియోలు విక్రయిస్తూ వ్యాపారం
* ఇంటి టెర్రస్పైనే చిత్రీకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డబ్బు సంపాదన కోసం ఓ దంపతులు పాడు పనులకు పాల్పడుతున్నారు. భార్యతో ఏకాంతంగా గడుపుతున్న వీడియోలను చిత్రీకరించి ఆన్ లైన్ (Online) అప్ లోడ్ చేస్తున్నారు. రూ. 2000 ఇచ్చే వారికి అశ్లీల వీడియోలు పంపుతున్నారు. ఈ దందాకు తమ ఇంటి టెర్రస్ నే వేదికగా చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ (Hyderabad) అంబర్పేట్కు అతడు గతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసేవాడు. ఇప్పుడు అంతగా ఆదాయం లేకపోవడంతో ఈ పాడు వ్యవహారానికి తెరలేపాడు. నాలుగు నెలల నుంచి తన భార్య తో గడుపుతున్న ప్రైవేట్ వీడియోలను కెమెరాలో చిత్రీకరించి వాటిని డబ్బు చెల్లించే వారికి ఆన్ లైన్ లో పంపుతున్నాడు. అందరూ కాకుండా డబ్బు చెల్లిస్తేనే చూసే విధంగా వ్యాపారం మొదలుటపెట్టాడు. ఇన్స్ట్రాగ్రామ్ (Instagram) పేజీలో లైవ్ స్ట్రీమింగ్(Live Streaming)ని సైతం ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వీడియో సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు బీటెక్ చదువుతుండగా, కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
………………………………………………….