
* మహిళలు, రైతుల నుంచి వివరాల సేకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల(LAGACHARLA) ఘటనపై విచారణ నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC-ST COMMISSION) అక్కడకు చేరుకుంది. చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం పర్యటిస్తోంది. లగచర్ల, రోటిబండ తండాలో రైతులు, మహిళల నుంచి వివరాలు సేకరిస్తోంది. కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేశారన్న అభియోగంపై పోలీసు లు అర్ధరాత్రి దాడులు నిర్వహించి అక్రమ అరెస్టులు చేశారని, తమతో అసభ్యంగా ప్రవర్తించారని పలువురు మహిళలు ఇటీవల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కమిషన్ విచారణ చేపడుతోంది. సంగారెడ్డి(SANGAREDDY) జైలులో రిమాండ్లో ఉన్న గ్రామస్థులతోనూ కమిషన్ సభ్యులు మాట్లాడనున్నారు.
………………………………………….