
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
* యువతకు మంత్రి సీతక్క సూచన
* తోపుకుంటలో జిమ్ను ప్రారంభించిన మంత్రి
* పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, వ్యాయామంతో
ఆత్మవిశ్వాసం పెరుగుతందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగామంత్రి సీతక్క మాట్లాడుతూ వ్యాయామం చేస్తే ఆత్మవిశ్వాసంతో పాటు మానసికంగా ఆందోళనలకు దూరంగా ఉండవచ్చు అని అన్నారు. వ్యాయామం అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో, బరువు తగ్గకుండా ఉండటానికి సహాయపడుతుందని అన్నారు.చదువు ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని మంత్రి అన్నారు. పట్టణంలో ఉన్న రెండు జిమ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె యువతకు సూచించారు. రానున్న రోజుల్లో ప్రతీ మండలంలోనూ జిమ్ను ఏర్పాటు చేయడం జరుగుతందని సీతక్క హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న నిరుపేదలకు మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశామన్నారు. రాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. రానివారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల మంజూరు నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దశలవారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………