ఆకేరు న్యూస్, హనుమకొండ :
ఆదివారం తెల్లవారు జామున ఆర్టీసీ వరంగల్ -2 డిపోలోని ఎలక్రిక్ బస్సులో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ చేసిఉన్న ఈ బస్సులో మంటలు చెలరేగడంతో డిపో అధికారుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభించినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేపట్టారు.
