
* ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
ఆకేరున్యూస్, వరంగల్: అజంజాహి కార్మికుల భవన స్థలాన్నికాపాడాలని, కబ్జాకోరులకు సహకరించిన మునిసిపల్ అధికారులపై చర్యలు తీసుకువాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేసారు. అజాంజాహి మిల్ కార్మికుల స్థలం ముమ్మాటికీ కార్మికులదే అని.. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసన్నారు. కానీ తప్పుడు పత్రాలు సృష్టించి వాటి ద్వారా మునిసిపల్ అనుమతి పొంది కార్మికుల భవనాన్ని నేలమట్టం చేయడం దారుణమని పేర్కొన్నారు. తప్పుడుదారిలో అనుమతినిచ్చిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని, కార్మికుల స్థలాన్ని పరిరక్షంచాలని డిమాండ్ చేసారు.
…………………………………………