
* ఎక్స్ వేదికగా జానిమాస్టర్ ట్వీట్
ఆకేరున్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు. జూనియర్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై.. బెయిల్పై బయటకొచ్చిన ఆయన.. తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్గా అయింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్.. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్పై బయటకొచ్చారు. కానీ, ఈ వ్యవహారంతో జానీ మాస్టర్ స్టార్ డమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బాధిత యువతి ‘మా’ అసోసియేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో.. ‘మా’ అసోసియేషన్ ఆయనపై చర్యలు తీసుకుంది.
డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ని తొలగించింది. ఆ తరువాత నేషనల్ అవార్డ్ సైతం వెనక్కి తీసుకున్నారు. అయితే, జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన క్రమంలో మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలపై జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా జానీ మాస్టర్కు ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్ను కొట్టేసింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోర్టు తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు. వారి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
…………………………………….