
* జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
* ఇందిరా మహిళా శక్తి పథకం టీస్టాల్ ను ప్రారంభించిన కలెక్టర్
ఆకేరు న్యూస్, జనగామ : రాష్ట్రంలోని కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని,కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండలంలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో ( Mahila Shakti Scheme ) భాగంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ ని ఆయన ప్రారంభించారు. మండలంలోని పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక అనే స్వయం సహాయక సంఘం సభ్యురాలు రచన మహిళా సమైక్య ద్వారా రెండు లక్షల ఋణం పొంది వనిత టీ స్టాల్ ని ఏర్పాటు చేసుకున్నారు. గురువారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని… జిల్లాలోని ఆయా గ్రామాల్లో అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా బ్యాంక్ల నుంచి రుణాలు అందేలా చేసి ఒక ప్రణాళికతో, మార్కెట్ డిమాండ్ను అనుసరించి సభ్యులు ఈ పథకాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.అందుకనుగుణంగా మహిళా సంఘ సభ్యులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ యూనిట్ లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ మహిళ ఆర్థికంగా బలపడాలని, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిమాండ్ కి తగ్గట్టు గా బిజినెన్ ని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వనిత టీ స్టాల్ లో అందరికి కలెక్టర్ టీ ఆర్డర్ చేసి అట్టి బిల్ మొత్తాన్ని యజమాని రేణుక కి అందించారు. ఈ కార్యక్రమం లో డి ఆర్డీ ఓ వసంత, మండల స్పెషల్ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ మల్లికార్జున్, డి టి ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………