
* మేఘాలయ హనీమూన్ మర్డరే స్ఫూర్తే
* గ్రామంలో పొలం చూడాలని భర్తను తీసుకెళ్లి..
* కారులో ఉండగానే వేటకొడవళ్లతో గొంతుకోసి హత్య
* 24/7 ప్రియుడితో వీడియో కాల్
* తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి
ఆకేరు న్యూస్, జోగులాంబ గద్వాల : తెలంగాణలో కలకలం రేపిన గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసు ను పోలీసులు ఛేదించారు. బ్యాంకు ఉద్యోగితో రిలేషన్ లో ఉన్న ఆమె.. తేజేశ్వర్ తో ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచే మర్డర్ కు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. తేజేశ్వర్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం నిశ్చయమైంది. ఆ తర్వాత కొద్ది రోజులు ఐశ్వర్య కనిపించలేదు. తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వెనక్కి వచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్ ను కలిసి మీ వాళ్లు అడిగిన కట్నం ఇవ్వలేకనే బంధువుల ఇంటికి వెళ్లిపోయానని, తనకు నువ్వంటే ఇష్టమని నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా తేజేశ్వర్ ఆమెను మే 18న వివాహం చేసుకున్నాడు. తిరుమలరావుతో కలిసి ఉండేందుకు పెళ్లి అయిన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. ఆయన ఆఫీసులో, ఈమె ఇంట్లో ఉన్నా 24/7 వీడియో కాల్ మాట్లాడుకుంటూనే ఉండేవారు.
అప్పటి నుంచే మర్డర్కు ప్లాన్
ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచే తేజేశ్వర్ ను చంపేందుకు ఐశ్వర్య, అతడి ప్రియుడు తిరుమలేశ్వర్ రావు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు మేఘాలయ హనీమూన్ మర్డర్ నే స్ఫూర్తిగా తీసుకున్నారు. తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి నిందితులు జీపీఎస్ ట్రాకర్ వాడారు. గ్రామంలో పొలం చూసేందుకు వెళ్దామని, భర్తను తీసుకెళ్లి.. కారులో ఉండగానే వేటకొడవళ్లతో గొంతుకోసి హత్య చేశారు. హత్య అనంతరం తిరుమలరావు, ఐశ్వర్య లఢాక్ వెళ్లిపోదామని ప్లాన్ చేశారు. హత్యకు ముందు తిరుమలరావు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. వారి ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కారు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ తిరుమల రావును ఏ1 గా, తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను ఏ2గా, అత్త సుజాతను A8గా చేర్చారు. తిరుమలరావుకు ఐశ్వర్య తల్లితో కూడా సంబంధం ఉండడం గమనార్హం.
……………………………………………………..