
ఆకేరున్యూస్, అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు సమాచారం.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైంది. కాగా, ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపడంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
……………………………………..