
* నిజామాబాద్లో ముగ్గురు..
* ఏపీ చిత్తూరులో ఇద్దరు..
* తెలుగు రాష్ట్రాల్లో విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆన్లైన్ బెట్టింగ్లు రెండు కుటుంబాల ఉసురు తీశాయి. ఒకేరోజు ఏపీ, తెలంగాణల్లో ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. కుమారుడికి ఉన్న బెట్టింగ్ పిచ్చి తల్లిదండ్రులను కూడా బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి చెందిన హరిష్ ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడేవాడు. దానివల్ల రూ. 30 లక్షల వరకు అప్పులు చేశాడు. ఒక్కగాని ఒక్క కుమారుడు అని గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు అప్పులు తీర్చేందుకు పొలం కూడా అమ్మేశారు. అయినా అప్పులు తీరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో కుమారుడి సహా ముగ్గురూ ఉరేసుకుని చనిపోయారు. వారిది చాలా మంచి కుటుంబమని పగోళ్లకు కూడా హాని చేయరని, కుమారుడి వ్యసనమే వారి ఉసురు తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మరో కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించింది. దంపతులు మృతి చెందగా, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. గంగాధరకు చెందిన నాగరాజురెడ్డి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడేవాడు. బెట్టింగ్ల వల్ల రూ. 70 లక్షల వరకు అప్పులు చేశాడు. చాలా డబ్బు బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చేదారి లేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగారు. దంపతులు మృతి చెందగా, ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.
…………………………….