కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్న ఉప్పలయ్య హోటల్ ఇదే..
* భారత ప్రభుత్వం అవార్డుతో అరుదైన గుర్తింపు
* హోటల్ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి
* 30 ఏళ్లుగా ఇంటి భోజనం అందిస్తున్న “ఉప్పలయ్య”
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేటకు వెళ్లి ఉప్పలయ్య హోటల్ (Uppalayya Hotel)ఎక్కడా.. అని ఎవరిని అడిగినా వేళ్లన్నీదారి చూపుతాయి. అబ్బో అంత గుర్తింపా.. అది ఎంత పెద్దదో అని ఆలోచించుకుంటూ అక్కడకు వెళ్తే.. ఓ చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లే హోటల్. ఉప్పలయ్య హోటల్. వచ్చీపోయే వినియోగదారులతో కళకళలాడుతూ ఉంటుంది. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందిస్తుండడంతో ఎప్పుడూ అది బిజీగా ఉంటుంది. సుమారు 200 మందికి ఒండి వారుస్తుంది. ఇప్పుడెందుకీ ఆ హోటల్ ప్రస్తావన అనుకుంటున్నారా? 30 ఏళ్లుగా నాణ్యమైన ఇంటి భోజనం అందిస్తున్న ఆ హోటల్కు తాజాగా భారత ప్రభుత్వం(Govt of India) గుర్తింపు లభించింది. ఈమేరకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం కార్యాలయం నుంచి నిర్వాహకులకు అధికారులు సమాచారం అందించారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
