
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
ఆకేరు న్యూస్ ములుగు ః జిల్లా ప్రజలు ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.మంగళవారం తన ఛాంబర్ లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్, ప్రచార కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూట్ – 1లో రామప్ప, భొగత జలపాతం,మల్లూరు నరసింహస్వామి దేవాలయం ఎక్స్ప్రెస్ బస్సు ద్వారా సందర్శనకు ఒక్కొక్కరికి 530/-. ఒక్కరోజుకుచొప్పున ప్రయాణ చార్జీలు ఉంటాయని తెలిపారు. రూట్ – 2 ద్వారా పంచారామాలు ప్రసిద్ధ 5 శైవ క్షేత్రలైన అమరావతి, బీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి 2300/- రెండు రోజులు ప్రయాణ చార్జీలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించు కోవాలని ఆయన వివరించారు. హనుమకొండ బస్సు స్టాండ్ నుండి ఈ నెల 27 న పంచారామాలు యాత్ర బస్సు బయలుదేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోత్స్న, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాజ్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………